న్యూఢిల్లి : కర్తార్పూర్ కారిడార్ అంశంలో భారత్, పాకిస్తాన్లు అంగీకారానికి రానున్నాయి. రేపు ఒక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. గురు నానక్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా కర్తార్పూర్ సాహిబ్ సందర్శనార్థం పాకిస్తాన్కు వెళ్లే సిక్కు భక్తులనుంచి 20 అమెరికన్ డాలర్లను ఫీజుగా వసూలు చేయాలని పాకిస్తాన్ నిర్ణయించింది. దీనిని భారత్ అంగీకరించడం లేదు. ఈ ఫీజును ఉపసంహరించుకోవడానికి పాకిస్తాన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు రేపు ఒక ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి.