ఇవాళ టీటీడీ దర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. తిరుమల అన్నమయ్య భవన్లో ఉదయం 10 గంటలకు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. పైవంతెన నిర్మాణంపై సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు. బాలాజీ జలాశయం నిర్మాణానికి దేవస్థానం నిధులపై, టీటీడీ విద్యాసంస్థల్లో బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీల భర్తీకి ఆమోదంపై కూడా చర్చించనుంది.