డిగ్రీ పట్టా కోసం ఓ మహిళా ఎంపీ చేసిన పని, ఇప్పుడామెను చిక్కుల్లో పడేసింది. తనలాగా డూప్ లను తయారు చేసి పరీక్షలకు పంపడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారాన్ని మీడియా బైట పెట్టడంతో యూనివర్శిటీ యాజమాన్యం ఆమెను బహిష్కించింది. బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ కి చెందిన ఎంపీ తమన్నా నుస్రీత్ ఈ అక్రమానికి పాల్పడింది. తమన్నా నుస్రత్ బంగ్లాదేశ్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ విద్యను అభ్యసిస్తున్నారు. ఆమె రాయాల్సిన మొత్తం 13 సబ్జెకుల పరీక్షల కోసం తన మాదిరిగానే ఉన్న 8 మందిని యూనివర్సిటీ పరీక్షలను తన తరఫున రాయించేందుకు 8 మంది డూప్ లను తయారు చేయించారు. వారితోనే పరీక్షలు రాయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన మీడియా, సాక్ష్యాలతో సహా మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ఈ డూప్ మహిళలు పరీక్షలు రాస్తుంటే, ఎంపీ అనుచరులు కాపలాగా ఉండటం గమనార్హం.