ప్లాస్టిక్ సమాజానికి పెనుప్రమాదంగా మారుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్న మన మనుగలో ప్లాస్టిక్ వినియోగం మాత్రం ఆగడం లేదు. తాజాగా తమిళనాడు వెటర్నరీ మరియు ఏనిమల్ సైన్సెస్ యూనివర్సిటీ సర్జన్స్ ఓ ఆవు కడుపులో ఉన్న 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కొద్ది రోజుల నుంచి ఆవు అనారోగ్యంతో ఉండడంతో వైద్యులు ఆవు కడుపులో వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. చివరికి ఆ ఆవుకు 5 గంటల పాటు శస్త్ర చికిత్స చేసి 52 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను, రెండు స్క్రూలు, ఒక నాణెం కూడా బయటకు తీశారు.