భారత ఆర్మీ మరో కీలక ఆపరేషన్ ను ప్రారంభించింది. బాలాకోట్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడుల తర్వాత మరోసారి మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ సైన్యం సాయంతో ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భారత సైన్యం ఎదురు దాడులు ప్రారంభించింది. తంగ్దార్ సెక్టార్ కు ఎదురుగా ఉన్నా నీలం లోయలోని 4 ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్థాన్ రేంజర్లతో పాటు 15మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్ సైన్యానికి చెందిన పోస్టులను కూడా నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్గికల్ 370 రద్దు తర్వాత భారత్ లోకి ఉగ్రవాదులను పంపి విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తుందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భారత సైన్యం ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.