పట్నా హైకోర్టు న్యాయమూర్తి బస్టిస్ రాకేశ్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. 2009లో జస్టిస్ రాకేశ్ కుమార్ పట్నా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2011లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. న్యాయమూర్తిగా ఆయన పదవీకాలం డిసెంబరు 31, 2020 వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మొత్తం 37 మంది న్యాయమూర్తుల వరకు నియమించుకునే వీలుండగా.. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి సహా 14 మంది ఉన్నారు. జస్టిస్ రాకేశ్ కుమార్ రాకతో ఆ సంఖ్య 15కు చేరనుంది.