జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లో భాగంగా కడప జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో కుటుంబాల నుంచి మాత్రమే వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో 42 పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో 22 ఇళ్లను ఎంపిక చేసుకొని నాలుగు బృందాలు గత నెల మూడు నుంచి సర్వేచేస్తున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలో 18 బృందాలతో సిగ్మా సంస్థ సర్వే నిర్వహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 12,584 కుటుంబాల నుంచి సమాచార సేకరణ చేయనున్నారు. గత రెండు రోజులుగా నూలివీడు రెవెన్యూ గ్రామాల్లో ఎంపిక చేసిన పల్లెలు పరిమిత ఇళ్లను ఎంపిక చేసుకొని సర్వే చేస్తున్నారు. అలాగే కొర్లకుంట గ్రామంలో కూడా రెండు రోజులు సర్వే ఉంటుందని సర్వే ప్రతినిధి జగదీష్ తెలిపారు. మహిళలు ఆరోగ్య పరిస్థితి, రక్తహీనత, పోషకాహారం, మరుగుదొడ్లు, అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలను వైద్య పరీక్షల ద్వారా సైతం నిర్దారిస్తున్నారు. సర్వే అనంతరం ఆరోగ్య, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఈ సమాచారంతో భారత ప్రజల ఆరోగ్యం ప్రణాళికలు తయారీకి ప్రభుత్వం యోచిస్తోంది. నూలివీడులో జగదీష్, శ్రీవిద్య, మమత, ప్రబిత తదితర బృందం సర్వే చేస్తున్నారు.