పరాయి స్త్రీ వ్యామోహంలో పడి తనను పట్టించుకోవడం లేదన్న ఆగ్రహంతో పంచాయతీ పెట్టించి మరీ భర్తను భార్య అమ్మేసిన ఘటన జరిగింది. అయితే ప్రియుడిని ప్రియురాలు కొనుక్కొని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. సినిమాను తలపించిన ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మహిళ భర్తతో కలిసి ఉంటోంది. అదే గ్రామానికి చెందిన మరో మహిళతో తన భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని సహించని భార్య.. ఎన్నోసార్లు నిలదీసింది. అయినప్పటికీ అతడు మారకపోవడంతో పంచాయతీ పెట్టించింది. సక్రమంగానే ఉంటానని చెప్పిన అతడు కొద్దిరోజులకే ప్రియురాలి వద్దకు వెళ్లడం ప్రారంభించాడు.
కోపంతో రగిలిపోతున్న ఆ మహిళ, తన భర్త రాసలీలలు జరుపుతున్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. గ్రామంలో పంచాయతీ పెట్టగా ప్రియుడిని వదులుకునేందుకు ప్రియురాలు అంగీకరించలేదు. నీ భర్త నా దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుని చెల్లించడం లేదు, దానికి ప్రతి ఫలంగానే అతడు నాతో ఉంటున్నాడని చెప్పింది.
జల్సాల కోసం అలవాటు పడి రూ.5లక్షల అప్పు చేసి ఫ్యామిలీ పరువు తీసిన ఇలాంటి భర్త తనకు వద్దని తాను బతికేందుకు రూ.5లక్షల భరణం కావాలని లేకుంటే కోర్టుకు వెళ్తానని ఆ మహిళ హెచ్చరించగా... నీవు కోర్టుకు వెళ్లి, పంచాయతీలు పెట్టాల్సిన అవసరం లేదని, తానే 5లక్షలు ఇస్తానని, నీ భర్తను నాకు వదిలేయాలని చెప్పడంతో ఆ మహిళ అంగీకరించింది. ఈ ఘటనను చూసిన గ్రామస్తులంతా షాక్ తిన్నారు.