ఇప్పటివరకు కుమారిగా ఉన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి శ్రీమతి కాబోతున్నారు. తన స్వగ్రామమైన శరభన్నపాలెంలో.. బుధవారం ఉదయం 9 :15 గంటలకు ఆమెను కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్దంగా పెళ్లికూతురిని చేశారు. తల్లి చెల్లాయమ్మతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు అంతా ఆమెను ఆశీర్వదించారు. మాధవికి గురువారం 3:15 గంటలకు గొలుగొండ మండలం కృష్ణదేవి పేట గ్రామానికి చెందిన.. సెయింట్ థెరెసా పాఠశాల కరస్పాండెంట్ కుసిరెడ్డి. శివప్రసాద్ తో వివాహం జరగనుంది. ఈమేరకు పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు.