కర్నూలు: రాయలసీమలో అక్కడక్కడ అంటరానితనం నెలకొని ఉందని, అంటరానితనం రూపు మాకెందుకు బిజెపి కృషి చేస్తుందని ఆ పార్టీ నేత టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వల్ల లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రణపై అవగాహన కల్పించుటకు గాంధీ సంకల్పయాత్ర దోహదం చేస్తుందన్నారు. దేశంలో పారిశ్రామిక విప్లవం తెచ్చేందుకు బిజెపి నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి లక్షల కోట్లు నిధులు వస్తున్న సక్రమంగా వినియోగించు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు.