వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు. నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. చంద్రబాబు నాయుడు దొంగల ముఠా, ఆయన బీజీపీలోకి పంపిన వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు.
ప్రతి రోజు కనీసం మూడు గంటలైనా మైకులో మాట్లాడక పోతే చంద్రబాబుకి భోజనం సహించదు, నిద్ర పట్టదు. ఏ మీటింగు లేక పోతే వీడియో కాన్ఫరెన్స్ పేరుతో తమను హింసిస్తాడని ఆ పార్టీ నాయకులు చెప్పి బాధపడుతున్నారు. బానిస మీడియాలో తన వీడియోలు, వార్తలు చూసుకుంటే తప్ప ఆయనకు తృప్తిగా ఉండదు.