ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 04:07 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి కేవలం రాత పరీక్షల్లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.అంతకు ముందు జాబ్ క్యాలెండర్ పై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. అత్యంత పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం అయ్యేలా ఆలోచన చేయాలన్నారు. అలాగే అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com