అమరావతి : విశాఖపట్టణంలోని గరికబండ గ్రామంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 1800 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న తుమ్మలపల్లి గ్రామంలో 40 కిలోల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 33 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురు ఉత్తరప్రదేశ్కు చెందిన వారని పోలీసులు తెలిపారు.