ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ లో పదో తరగతి పరీక్ష విధానంలో మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 16, 2019, 12:40 PM

ఏపీలో పదో తరగతి పరీక్షల విధానం పై పలు కీలక మార్పులు చేశారు. ఈ సంవత్సరం నుంచే నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. పదో తరగతి పరీక్షలో ఇక పై బిట్ పేపర్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానుంది.


ప్రభుత్వం చేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి.


పరీక్ష సమయాన్ని 2.30 గంటల నుంచి 2.45 నిమిషాలకు పెంచారు. ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాల సమయం కేటాయించారు. ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌/ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కాంపోజిట్‌ కోర్సుకు 3:15 గంటలు. సెకండ్‌ లాంగ్వేజ్‌కి 3 గంటలు. గా సమయాన్ని కేటాయించారు.


ఇక పై ప్రతి విద్యార్ధికి సమాధానాలు రాసేందుకు 24 పేజిల బుక్ లెట్ ఇస్తారు. ఇందులోనే అన్ని సమాధానాలు రాయాలి. అదనపు ఆన్సర్ షీట్లు ఇవ్వరు.


ఇక పై బిట్ పేపర్ ఉండదు. ప్రధాన ప్రశ్నాపత్రంలోనే లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇస్తారు.


సర్టిఫికెట్ లో సబ్జెక్టుల వారీగా, పేపర్‌ వారీగా గ్రేడులు ఇస్తారు.


సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.


పాస్ మార్కుల విధానం పై స్పష్ణత ఇవ్వలేదు. పాత పద్దతి మాదిరిగానే పాస్ మార్కుల విధానం ఉంటుందని తెలుస్తోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com