ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొహమ్మదాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న సిలిండర్ పేలిపోగా రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలనో 10 మంది చనిపోగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రులకు తరలించారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చన్న అనుమానాలతో పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.