ఢిల్లిలో కాలుష్యాన్ని తగ్గించడానికి చేసే కృషిలో భాగంగా మరొకసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయనున్నారు. నవంబర్ 4నుంచి 15వ తేదీ వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. ఈసారి సిఎన్జి వాహనాలకు ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. ఈ విధానంలో సరి సంఖ్యతో ముగిసే నెంబర్లున్న ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్యతో ముగిసే నెంబర్లున్న వాహనాలు మరొక రోజు రోడ్లపైకి రావలసి ఉంటుంది.