చెన్నైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వరుసగా రెండో రోజు భేటీ అయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో నిన్న ఇష్టాగోష్టి జరిపిన వీరిద్దరూ, శనివారం కోవలంలో సమావేశమయ్యారు. ఈ ఉదయం కోవలంలోని తాజ్ ఫిషర్మ్యాన్స్ కోవ్ హోటల్కు చేరుకున్న జిన్పింగ్కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం వారివురూ బ్యాటరీ కారులో ప్రయాణించి సమావేశ గదికి చేరుకున్నారు. నిర్షిష్ట ఎజెండా, అధికార లాంఛనాలు లేకుండా కులాసా వాతావరణంలో జరిగిన ఈ భేటీలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ భేటీ అనంతరం ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరుగుతాయి. శిఖరాగ్ర సదస్సు తర్వాత రెండు దేశాల అధికారులు విడివిడిగా ప్రకటనలు విడుదల చేయనున్నారు.