అవనిగడ్డ పట్టణంలోని వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రాజశేఖర్ స్వామి వారి దేవస్థానం లో నూతనంగా నిర్మించిన 29అడుగుల మహా శివుని విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలో పాల్గొన్న *ఏపీ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరియు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారు..* ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొని అక్కడ నుంచి అవనిగడ్డ గ్రామదేవత శ్రీ లంక అమ్మవారిని దర్శించుకున్నారు..అనంతరం స్థానిక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు గారు మరియు మండల కన్వీనర్లు మంత్రిగారికి శాలువా కప్పి గజమాలతో సత్కరించారు..ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.