బోటు ప్రమాదం జరిగి 21 రోజులైనా మృతదేహాలను వెలికితీయించలేకపోయిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అని విరుచుకుపడ్డారు టీడీపీ నేత పంచుమర్తి అనురాధ ఆరోపించారు. పోటు మునిగిన రోజున సిఎం, పర్యాటక మంత్రులు ఎక్కడున్నా రని, ఏం చేసారని ప్రశ్నించారు. వారి రోజువారీ పనిని పరిశీలిస్తే ప్రమాదం జరిగాక సీఎం ఏరియల్ సర్వే చేసి వదిలేశారు మినహా తదుపరి ఎక్కడ వారి గురించి పట్టించుకోలేదని, కనీసం ఈ విషయమై సమీక్షించేందుకు కూడా సమయం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏరియల్ సర్వేలో జగన్ మంత్రులు నవ్వుతున్న ఫోటోలు మీడియాలో వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, సామాన్యుల ప్రాణాలంటే జగన్కు లెక్కలేదని అర్ధమవుతోందన్నారు. బోటు తీయటం చేతకాకుంటే కేంద్ర జలవనరుల శాఖ సహకారం ఎందుకు ఇప్పటి వరకు అభ్యర్ధించ లేదని ఆమె ప్రశ్నించారు. ప్రజల నుంచి ప్రశ్నలు కురుస్తున్నా జవాబిచ్చే పరిస్తితిలేక జలవనరులు, పర్యాటక మంత్రులు పత్తాలేకుండా పోయారని ఎద్దేవా చేసారు.బోటు ప్రమాదంపై ప్రశ్నించిన దళిత నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పంచుమర్తి అనురాధ దుయ్యబట్టారు. తమ వారు ఒడ్డుకు చేరారో మరణించారో తెలియక కొందరు పిండప్రదానాలు చేసుకునే విచారకరమైన దృశ్యాలు ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేసారామె. దసరా కేవలం వైసీపీ కార్యకర్తలకేనని, ఓట్లు వేసిన ప్రజలకు దసరా సంతోషం లేదన్నారు.