కేసిఆర్ వద్ద ఏపి ప్రయోజనాలని జగన్ తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు మాజీ మంత్రి ఆలపాటి. సోమవారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చెప్పేదానికి చేసే దానికి పొంతన లేదన్నారు. కనీస అర్హత లేని సొంత వ్యక్తులకు ప్రాజెక్టులు కట్టబె్టేందుకే రిటెండరింగ్ నిర్వహించారని లిఫ్ట్ ఇరిగేషన్ లు చేసుకునే కాంట్రాక్టర్ లకు పోలవరం పనులు కట్టబెట్టడం పై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ లో ఆదా కంటే నష్టమే ఎక్కువ, లాభం బెత్తెడు…నష్టం బారెడు లా ఉంది ప్రభుత్వ పనితీరని ఎద్దేవా చేసారు. అసలు జగన్ చేస్తోంది “రీ” టెండరింగా…? “నీ” టెండరింగా..? గా అని నిలదీసారు.
మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ప్రధాని కలసినట్టు కనిపించడంలేదని, చర్చల సారాంశాన్ని బయటకు కనీసం మీడియాకు చెప్పేందుకు కూడా ఎందుకు సంకోచిస్తున్నారని నిలదీసారాయన. సిబిఐ కేసులు కోసమా…? మీ కాంట్రాక్టర్ ల కోసమా ..? దేని కోసం ప్రధానిని కలిశారో చెప్పాలి. బయటకు చెప్పుకోలేని చర్చలు జరిపారా ? అని ప్రశ్నించారు.
,