తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండి క్యూలైన్లు వెలుపలకి వచ్చాయి. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. 6వ రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు హనుమంత వాహనం, సా.5 గంటలకు స్వర్ణరథం, రాత్రి 8 గంటలకు గజవాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు.