దేశంలో పెరిగిపోతున్న అసహనం.. మూకదాడులపై ప్రధానికి మొత్తం 50 మంది బహిరంగ లేఖ రాశారు. వారందరిపై ఇప్పుడు దేశద్రోహం కేసు నమోదైంది. ఆ 50 మంది సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు . బీహార్ సదర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం సంచలనమైంది. జులైలో ప్రధాని మోదీకి లేఖ రాసిన ఆ యాభై మంది పేర్లు ఇప్పుడు ప్రముఖంగా హైలైట్ అవుతున్నాయి. మూకదాడులతో అసహనం పెరిగిందని వ్యాఖ్యానించినందుకు వీళ్లందరినీ దేశద్రోహులుగా పరిగణించాలన్నది ఆ కేసు సారాంశం. సెలబ్రిటీలు దేశ ప్రతిష్ఠ తో పాటు మోదీ ఇమేజ్ ను భంగపరిచే విధంగా లేఖ రాశారని ఆరోపిస్తూ లాయర్ సుధీర్ కుమార్ ఓఝా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ముజఫర్ పూర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సూర్యకాంత్ తివారీ ఆదేశాలివ్వడంతో కేసు నమోదవ్వడమే కాదు. తాజా వ్యవహారంతో లెజెండరీ దర్శకుడు మణిరత్నం- కొంకణా సేన్- అపర్ణాసేన్- శ్యామ్ బెనగల్ – రామచంద్ర గుహా సహా మొత్తం 50 మంది సెలబ్రిటీలపై దేశద్రోహం కేసు నమోదయింది.