లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం లో ఉన్న దుర్గమ్మను దర్శించు కోవడం ఆనందంగా ఉంది.దేవినేని ఉమ మాట్లాడుతూ ... ఈసారి అధికార పార్టీ నేతల హడావుడే ఎక్కువుగా కనిపించింది. ఫ్లెక్సీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా ఉంది. వంద రూపాయలు టిక్కెట్ లను విఐపి ముద్రలు వేసి అమ్ముకుంటున్నారు. ఏ మంత్రి అండదండలతో ఇదంతా జరుగుతుంది అమ్మవారి టిక్కెట్ లను కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు. మూడువందలు టిక్కెట్ కొన్నవారు మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. అధికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో వెళుతున్నారు. నేడు ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి.. రోజు గడవటమే కష్టం గా ఉంది. ఇసుక కొరత తో ఉపాధి లేదు.. పనులు లేవు.. డబ్బులు లేవు అందుకే ఈసారి దసరా ఉత్సవాలకు భక్తులు సంఖ్య తగ్గింది అన్న ప్రసాదంలో నాణ్యత పెంచాలని భక్తులు చెప్పారు . దాతలు ఇచ్చిన సొమ్ములో అరవై కోట్లు ఉన్నాయి.. ఆ వడ్డీ తో మంచి భోజనం పెట్టాలి. కనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లైఓవర్ పనులు పూర్తి అయితే భక్తులకు మరింత సౌకర్యంగా ఉంది