గాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్ సాకారం దిశగా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ప్రధాని, గాంధీజీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం అహ్మదాబాద్లో స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో పాల్గొని గాంధీ సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా గాంధీ 150 జయంతి గుర్తుగా ప్రధాని మోదీ రూ.150 నాణెంను విడుదల చేశారు. కాగా ఈ నాణెం చెలామణిలోకి వస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.