మధ్యప్రదేశ్ లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రైసేన్ పట్టణం వద్ద గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బ్రిడ్జి పై నుంచి బస్సు అదుపు తప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో పది మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ, 2 సంవత్సరాల బాలుడు ఉన్నారు. బస్సు రైసేన్ నుంచి ఛత్తార్ పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.