న్యూఢిల్లి : కర్ణాటక కాంగ్రెస్ నేత డికె శివకుమార్ జ్యుడిషియల్ రిమాండ్ను అక్టోబర్ 15 వరకూ పొడిగిస్తూ ఢిల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేటితో శివకుమార్ జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరు పరిచారు. తీహార్ జైలులో ఈ నెల 4, 5 తేదీలలో శివకుమార్ను ప్రశ్నించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.