ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసులో ఆగస్టు 21న అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సోమవారం కలిసారు. తమ పార్టీ నేతలకు అండగా ఉంటామన్న సంకేతాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వినిపించింది. సోనియా, మన్మోహన్ తనను కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేయాలని తన కుటుంబ సభ్యులకు తెలిపినట్లు చిదంబరం పేర్కొన్నారు.