దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో దొంగలు బీభత్సం సృష్టించి, హల్చల్ చేస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇష్టాను సారం పెట్రేగి పోతు అయిన కాడికి దోచుకుపోతున్నా, పోలీసులంటే వారికి భయంలేకుండా పోయిందంటూ సాక్షాత్తూ ఢిల్లీ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తన ఇంట్లోనే దొంగతనం జరిగిన విషయాన్ని బైట పెట్టారు. ఇందుకు సంబంధించి వివరాలలోకి వెళితే న్యూఢిల్లీలో సరస్వతీ విహార్ ప్రాంతంలో నివాసముంటున్న మంత్రి సత్యేందర్ జైన్ గత మంత్రి ఇల్లు ఆరు నెలలుగా వాడటం లేదు. దీనిని గుర్తించిన దొంగలు ఏంచక్కా ఇంటి తలుపులు విరగొట్టి మరీ అందిన వస్తువులను దోచుకెళ్లారు. చుట్టుపక్కలవారిచ్చిన సమాచారంతో మంత్రి భార్య పూనం జైన్ తన ఇంటిని సందర్శంచి దొంగలు చేసిన బీభత్సాన్న ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. మంత్రి నివాసంలో దొంగలు పడిన విషయంపై ఫిర్యాదు నమోదైందని, బెడ్ రూం, కిచెన్ లతో పాటు పై అంతస్తులలోనూ కలియదిరిమరీ పలు వస్తువులను ఎత్తుకెళ్లారని ఢిల్లీ డీసీపీ కోన్ చెప్పారు
కాగా మరోవైపు మంత్రి సత్యేందర్ జైన్ చోరీ ఘటనపై ట్వీట్ చేస్తూ, ‘‘ నా ఇంట్లో దొంగలు పడ్డారు...భవనం అంతాగాలించి పలు వస్తువులను చోరీ చేశారు. దొంగలు, సంఘవ్యతిరేక శక్తులకు ఢిల్లీ పోలీసులంటే భయం లేదు’’ అని వాపోయారు.