అదుపు తప్పి కారు నదిలో పడడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. నిజ్ముల్లా-బిరాహి రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, మరొకరు ఆ నదిలో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న ఎన్ డిఆర్ ఎఫ్ బృందాలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.