రోజు రోజుకు కొంతమంది అధికారాలు చేసే పనులతో ఆ శాఖలకు చెడ్డపేరు తెచ్చిపెడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకొనేందుకు రవాణా శాఖ అధికారులు రూ. 500ల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే... నిరంకర్ సింగ్ దేశ రాజధానిలో ఓ ట్రాస్స్పోర్టు కంపెనీ నిర్వహిస్తుంటారు. ఆ కంపెనీ పేరు మీద దాదాపు 50 బస్సులు ఉన్నాయి. నోయిడా, గ్రెటర్ నోయిడాలలో ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. కాగా.. బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోని కారణంగా చలానా విధించారని తెలియడంతో ఆయన ఆశ్చర్యపోయారు.
'ఇటువంటి ఘటనలు రవాణాశాఖకు చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని నేను వెంటనే అధికారుల వద్దకు తీసుకెళతాను. అవసరమైతే కోర్టుకు కూడా వెళతాను' అని నిరంకర్ సింగ్ తెలిపారు. కాగా..ఈ విషయంపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామన్నారు.