కోల్కతా : బంగారం స్మగ్లింగ్ బాగోతాన్ని పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ బట్టబయలు చేసింది. బంగ్లాదేశ్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు పశ్చిమ బెంగాల్ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సీల్దా రైల్వేస్టేషను పార్కింగ్ ప్రాంతంలో ముగ్గురు బంగ్లాదేశీయులు అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకున్నారు. బంగ్లాదేశీయుల నుంచి 850 గ్రాముల బరువున్న 8 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.