ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్కు 2016 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్ వేర్వేరుగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలపగా, ఈ రోజు ఆ ఫేమిలీకి చెందిన బన్నీ కూడా విశ్వనాథ్ను కలిశాడు. తాను ఈ రోజు విశ్వనాథ్ను కలిశానని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపి, ఈ సందర్భంగా విశ్వనాథ్తో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. విశ్వనాథ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఆయనను ఆత్మీయంగా పలుకరించి, కొద్దిసేపు ఆయనతో మాట్లాడాడు. విశ్వనాథ్ను కలిసినందుకు బన్నీ హర్షం వ్యక్తం చేశాడు.