టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని, జగన్లా కక్షపూరిత పాలన మేం చేయలేదని దేవినేని ఉమ విమర్శించారు. ప్రాజెక్ట్లు ఎందుకు నిలిపివేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వ అభివృద్ధే కనిపిస్తోందని, రివర్స్ టెండరింగ్ ద్వారా 10 శాతం తక్కువకు పనులు జరిగినా టీడీపీపై అవినీతి బురదజల్లాలని జగన్ ఆరాటపడుతున్నారని దేవినేని ఉమ అన్నారు.