వైసీపీ వందరోజుల పాలనపై రేపు స్పందిస్తానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నవులూరులో ఇసుక క్వారీని పరిశీలించిన పవన్ మాట్లాడుతూ కార్మికుల కష్టాలను తెలుసుకొనేందుకు వచ్చానని.. ఎలా పడితే అలా విమర్శలు చేయమని, క్షేత్రస్థాయిలో పరిశీలించే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామన్నారు. ఇసుక కొత్త విధానంలో చెప్పిన రేటుకే అమ్మాలన్న పవన్ టన్ను ఇసుకకు రూ900 వసూలు చేస్తున్నారని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా గుర్తించామన్నారు.