కలెక్టర్ హరిజవహర్లాల్ శనివారం జిల్లాలోని బొండుపల్లి, మక్కువ, సాలూరు మండలాల్లో సుడిగాలిప పర్యటన చేశారు. ప్రభుత్వ అసుపత్రులు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో స్వచ్చతను పరిశీలించారు. పచ్చదనం తీరును కూడా ఆయన తనిఖీ చేశారు. చాలా ప్రాంతాల్లో అపరిశుభ్రత పై కలెక్టర్ అధికారులు సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తంచేశారు. మక్కువ గ్రామంలోని తాహసిల్ధార్ కార్యాలయంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంతో సంబంధిత అధికారులను తీవ్రంగా మందలించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శిని సస్పెండ్చేశారు. అలాగే తాహసిల్ధార్కు చార్జిమెమో ఇచ్చారు. జిల్లాలో పారిశుద్ధ్యం పనితీరు సరిగ్గాలేక కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హరిజవహర్లాల్ హెచ్చరించారు.