ఇకపై ఏటీఎం లేకుండానే నగదు తీసుకునేలా తన ఎటిఎంలలో యుపిఐ క్యూఆర్ సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ ఖాతాదారులు తమ మెబైల్ పోన్ లోని బ్యాంక్ యుపిఐను వినియోగించి ఎటిఎం స్రీన్ పై వచ్చే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నగదు డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో లావాదేవీల్లో భద్రత పెరుగుతోందని బీవోఐ బ్యాంకు పేర్కొంది. అయితే ఇందులో బ్యాంకు కస్టమర్లు గరిష్ఠంగా రూ. 2000 మాత్రమే విత్ డ్రా చేయవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, చెన్నై, నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న 6 నెలల్లో దేశవ్యాప్తంగా అమలు కానుంది.