ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీలకమైన 15 నిమిషాల్లో ఏం జరిగింది ? 

national |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2019, 01:01 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రయోగంకు చివరి దశలో అంతరాయం కలిగింది. చంద్రుడి ఉపరితలానికి 2.1కి.మీ దూరంలో ఉన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్ నుంచి కట్ అయ్యాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు నిరుత్సాహానికి లోనయ్యారు. 48 రోజులు అంతా సాఫీగానే సాగింది. ఇక చందమామపై మరో 15 నిమిషాల్లో విక్రమ్ అడుగుపెట్టబోతుంద నుకున్న సమయంలో అంతా ఉత్కంఠనెలకొంది. ఇస్రో ముందుగానే తెలిపింది.. చివరి పదిహేను నిమిషాలు ఎంతో కీలకమని. అయితే ఇస్రో సైంటిస్టులు అయితే ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ముందు అనుకున్నట్లుగానే జరిగిపోయింది. శాస్త్రవేత్తలు అనుకున్న కీలకమైన 15 నిమిషాల్లో 14 నిమిషాలు తీవ్ర ఉత్కంఠ మధ్య సజావుగానే గడిచిపోయాయి. ఇక మరొక్క నిమిషం.. కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు.. ఇస్రోలో టెన్షన్ నెలకొంది. 
అప్పటిదాకా వచ్చిన విక్రమ్ సిగ్నల్స్.. ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీంతో సైంటిస్టుల‌ ముఖాల్లో.. అప్పటి వరకు సంతోషంలో ఉన్న వారి ముఖంలో.. చిరున‌వ్వులు దూరమయ్యాయి. అప్పటి దాకా.. 48 రోజులు సజవుగా సాగిన చంద్రయాన్2 ప్రయాణం.. చివరి నిమిషంలో సిగ్నల్స్‌లో అంతరాయం ఏర్పడింది. చంద్రుడి ఉపరితలానికి మరో 2.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న సమయంలో ఈ ఊహించని సమస్య ఎదురైంది. మరి ఇంతకి.. విక్రమ్ క్రాష్ అయ్యిందా.. ? లేదంటే ల్యాండ్ అయిన తర్వాత.. సిగ్నల్స్ కట్ అయ్యాయా.. ? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 
అయితే చంద్రుడి ఉపరితలం వైపు గంటకు 6000 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్లిన విక్రమ్‌ను.. ఆ స్పీడ్‌ను తగ్గించేందుకు ఇస్రో చాలా కష్టపడాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ ల్యాండర్ వేగానికి బ్రేకులు వేసేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ల్యాండర్ యొక్క నాలుగు మూలలతో పాటు.. మధ్య భాగంలో థ్రస్టర్స్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు థ్రస్టర్స్‌ని వ్యతిరేక దిశలో ప్రయోగించి దాని వేగాన్ని తగ్గించారు. మొదట రఫ్ బ్రేకింగ్ కక్ష్యను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాక.. ఫైన్ బ్రేకింగ్ ప్రారంభమైంది. అప్పుడు అనుకున్నట్లుగానే ల్యాండర్ వేగం తగ్గుతూ వచ్చింది. అయితే ఆఖరి నిమిషంలో విక్రమ్ నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయి. మరో నిమిషంలో చందమామపై అడుగుపెడుతుందనుకున్న సమయంలో ఈ అంతరాయం కలిగింది.
అయితే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అనేది అంత సాధారణమైన విషయమేమి కాదు. ఇప్పటిదాకా అనేక దేశాలు సాఫ్ట్ ల్యాండింగ్‌ కోసం ప్రయత్నించి విఫలమయ్యాయి. అమెరికా, రష్యా, చైనా చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ రేటు.. కేవలం 37శాతం మాత్రమే. ఆ విషయం తెలిసినప్పటికీ… ఇస్రో దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్న ఇస్రో.. చంద్రయాన్2 ప్రయోగించింది. సరిగ్గా 48 రోజులు చందమామ వైపు ప్రయాణించి.. మరో నిమిషంలో దిగబోతుండగా.. అంతరాయం ఏర్పడింది. అయితే ఇంతకు విక్రమ్ ల్యాండర్ ఏమైంది. అసలు మరో నిమిషంలో దిగాల్సిన ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అవ్వడంతో ఏమై ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, విక్రమ్ వేగం అదపు తప్పి క్రాష్ అయిందా.. ? లేక ల్యాండ్ అయ్యాక సిగ్నల్ వ్యవస్థ నిలిచిపోయిందా..? అన్నది తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com