మహారాష్ట్రాలోని ముంబై నగరంలో మూడు మెట్రోరైలు మార్గాల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శంకుస్థాపన చేశారు. బెంగళూరులోని ఇస్రో కార్యాలయం నుంచి బయలుదేరిన మోదీ శనివారం ఉదయం ముంబై చేరుకున్నారు. ముంబై వచ్చిన ప్రధాని మోదీకి మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు ఘన స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మోదీ విల్లే పార్లేలోని లోకమాన్య సేవాసంఘ్ తిలక్ మందిర్ లో పూజలు చేశారు. అనంతరం ముంబై నగరంలో కొత్తగా నిర్మించనున్న మూడు మెట్రోరైలు మార్గాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శంకుస్థాపన చేశారు.