న్యూఢిల్లి : ఎయిర్సెల్ మాక్సిస్ కేసు విచారణను ఢిల్లిలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు నిరవధికంగా వాయిదా వేసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇ.డి., సిబిఐలు తమకు మరింత వ్యవధి కావాలని, కేసు విచారణను అక్టోబర్ మొదటి వారంలో చేపట్టాలని కోరాయి. ప్రాసిక్యూషన్ వారు తేదీల తరువాత తేదీలు చొప్పున వాయిదాలు కోరుతున్నారని కోర్టు పేర్కొంది. ఈ కేసును నిరవధికంగా వాయిదా వేస్తున్నామని, దర్యాప్తు పూర్తిగా జరిగిన తరువాత, వివిధ దేశాలనుంచి లెటర్స్ రొగేటరీలు అందిన తరువాత ప్రాసిక్యూషన్ ఈ కేసు విచారణ కోసం కోర్టుకు రావచ్చునని న్యాయమూర్తి అన్నారు.