ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసును నిరవధికంగా వాయిదా వేసిన ఢిల్లి కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2019, 12:36 PM

న్యూఢిల్లి :  ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసు విచారణను ఢిల్లిలోని రౌజ్‌ ఎవెన్యూ కోర్టు నిరవధికంగా వాయిదా వేసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఇ.డి., సిబిఐలు తమకు మరింత వ్యవధి కావాలని, కేసు విచారణను అక్టోబర్‌ మొదటి వారంలో చేపట్టాలని కోరాయి. ప్రాసిక్యూషన్‌ వారు తేదీల తరువాత తేదీలు చొప్పున వాయిదాలు కోరుతున్నారని కోర్టు పేర్కొంది. ఈ కేసును నిరవధికంగా వాయిదా వేస్తున్నామని, దర్యాప్తు పూర్తిగా జరిగిన తరువాత, వివిధ దేశాలనుంచి లెటర్స్‌ రొగేటరీలు అందిన తరువాత ప్రాసిక్యూషన్‌ ఈ కేసు విచారణ కోసం కోర్టుకు రావచ్చునని న్యాయమూర్తి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com