తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం దిండి నుండి అంతర్వేది బయలుదేరారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం స్థానిక మత్సకారులతో సమావేశమవుతారు. కాగా అంతకు ముందు దిండిలో స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించి బయలుదేరిన జనసేనానికి . రామరాజు లంక లో జనం నీరాజనం పలికారు. రామరాజు లంక నుండి బయలుదేరి పెదలంక మీదుగా అంతర్వేది వెళ్లారు.