ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంబోడియాకు బయలుదేరిన యుద్ధ నౌకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 06, 2019, 10:55 AM

విశాఖపట్నం: భారత నౌకా దళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి, ఐఎన్‌ఎస్‌ కిల్తాన్‌లు మూడు రోజుల పర్యటనకు కంబోడియాకు బయలుదేరి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఉపకరిస్తుందని తూర్పు నౌకాదళం పేర్కొంది. రాయల్‌ కంబోడియన్‌ నేవీతో వృత్తిపరమైన అంశాలు, ఉన్నతాధికారులతో సమావేశాలు, అక్కడి ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించింది. సహ్యాద్రికి కెప్టెన్‌ అశ్విన్‌ అరవింద్‌, కిల్తాన్‌కు కమాండర్‌ గింటో జార్జ్‌ చాకో సారథ్యం వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com