57 ఏళ్ల తర్వాత గర్భం దాల్చిన మంగాయమ్మ. కవలలకు జన్మనివ్వబోతున్న బామ్మా.గుంటూరు లోని అహల్య నర్సింగ్ హోమ్ లో ఆపరేషన్.ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతున్న బామ్మా.తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962, మార్చి 22న వివాహమైంది. పెళ్లై ఎన్నాళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారి ఆశలు నెరవేరకుండానే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు. కాగా తల్లి కావాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం గురించి తెలుసుకున్న మంగాయమ్మ తాను కూడా ఐవీఎఫ్ పద్దతిని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. గడిచిన నవంబరులో గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్ను ఆశ్రయించారు. మంగాయమ్మకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. కాగా మంగాయమ్మ మెనోపాజ్ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని, మంగాయమ్మ భర్త నుంచి వీర్యాన్ని సేకరించి ఐవీఎఫ్ పద్ధతిలో చికిత్సను ప్రారంభించారు. మొదటి సైకిల్లోనే వైద్యుల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది.