తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగలనుంది. కీలక నేతలుగా ఓ వెలుగు వెలిగిన రేవూరి ప్రకాష్రెడ్డి, రవీంద్రనాయక్ ఇద్దరూ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమై పోయారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కీలక నేతలు, సిట్టింగ్లు, మాజీలు ఆయా పార్టీలకు గుడ్ బై చెప్పేసి కాషాయ కండువా కప్పేసుకున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలసి బుధవారం ఢిల్లీకి రేవూరి ప్రకాష్రెడ్డి, రవీంద్రనాయక్ వెళ్లనున్నారు. వీరిద్దరూ షా ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టు సమాచారం.