బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ అంతిమయాత్ర ప్రారంభమైంది. దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఊరేగింపుగా యమునా నది ఒడ్డు వరకు ఇది కొనసాగనుంది. అంతిమయాత్రకు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్ ఘాట్లో జైట్లీ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.