హుద్హుద్ ఇళ్ల ప్రారంభోత్సంలో గందరగోళం నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హుద్హుద్ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వైసీపీ తీరును నిరసిస్తూ వర్షంలోనే ఎమ్మెల్యే అనుచరులు నిరసనకు దిగారు. దీంతో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గందరగోళం మధ్యనే మంత్రి అవంతి శ్రీనివాస్ ఇళ్లు ప్రారంభించారు.