కడప, మేజర్న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కోర్టు స్టేలు ఎక్కువ కాలం నిలవవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. కడపలో ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో బాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. రాషా్టన్న్రి సింగపూర్, జపాన్లా తయారు చేస్తానని చెప్పి అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతి సొమ్ముతో ఎంపీటీసీలను ప్రలోభపెడుతున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కడపలో వైసీపీ విజయం తథ్యమని నేతలు స్పష్టం చేశారు.