గుంటూరు,సూర్యప్రతినిధి: పొగాకు బోర్డు సమీపంలో యర్రంశెట్టి గ్రూపు వారి కన్వెన్షన్ హాల్ను శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో అధునాతన కన్వెన్షన్ సెంటర్ల అవసరముందని ఆయన అన్నారు. భవిష్యత్లో మరిన్ని కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు కావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి సంస్థ అధినేత వేములపల్లి వెంకట నర్సయ్య, యర్రంశెట్టి రాము, యర్రంశెట్టి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.