రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చెప్పినప్పటికీ ఈ విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. అధారిటీ సీఈవో చెప్పినఅంశాలను బేఖాతరు చేస్తూ ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ముందడుగు వేయాలని భావిస్తున్నారు జగన్. ఈ మేరకు ఆగస్టు 17 వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తద్వారా పెద్దఎత్తున నిధులు మిగిల్చి తిరిగి ప్రజలకే ఖర్చుచేస్తామని చెపుతున్నారు య్వప్ వర్గాలు. మరో వైపు ఇది కేంద్ర ప్రాజెక్ట్ మాకేం సంభందం లేదని గతంలో చెప్పిన నేతలు, ఇప్పుడు కేంద్ర అనుమతులు తీసుకోకుండా, కేంద్ర సంస్థలు, మంత్రుల హెచ్చరికలు పరిగణలోకి తీసుకోకుండా ముందుకు సాగితే భవిష్య పరిణామాల సంగతేంటన్న చర్చ సాగుతోంది .