అమెరికాలో మతిలేనివారే కాల్పులకు తెగబడుతున్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల అమెరికాలో వరుస కాల్పుల ఘటనలపై ఆయన మాట్లాడుతూ నిజాయితీపరుల వద్ద తుపాకులు ఉన్న ఎలాంటి సమస్యలు ఉండవని, కానీ మతిలేని వారివద్ద, మానసిక స్థితి సరిగా లేనివారి వద్ద తుపాకులు ఉంటే కాల్పులకు తెగబడతారని అన్నారు. ఇలాంటి వారికోసం అమెరికాలో మరిన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేసే విషయమై అధికారులతో మాట్లాడుతానని ట్రంప్ అన్నారు. దేశంలో తుపాకీ సంస్కృతిని తాము గమనిస్తున్నామని, కొన్నేళ్ల కిందట మానసిక విద్యా సంస్థలను మూసివేయడంవల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. అమెరికాలో వారం రోజుల్లోనే రెండుసార్లు కాల్పుల ఘటనలు జరిగి నలుగురు చనిపోయారు.