కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, పామర్రు మండలాలలో పలు గ్రామాలు నీటమునిగాయి. జగ్గయ్యపేట మండలంలో వావిరాల, జయంతిపురం గ్రామాలు, పామర్రు మండలంలో ఎనిమిది లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుకుంది. ఈ రాత్రికి మరింత ప్రమాద దశకు చేరుకునే అవకాశం ఉండగా ఆయా గ్రామస్థులు మాత్రం పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.